వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి రాజమహేంద్ర వరం కోర్ట్ మళ్ళీ షాకిచ్చింది. అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టి వేసింది రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టు. సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్షుల భద్రతకు ముప్పు ఉందన్న ప్రత్యేక పిపి ముప్పాళ్ళ సుబ్బారావు వాదనతో ఏకీభవించింది. ఈ కేసులో అనంతబాబుతో పాటు ఏ2, ఏ3గా ఉన్న కడియాల సతీశ్, మహాలక్ష్మిల బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది కోర్టు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో ప్రస్తుతం జైలులో ఉన్నారు వైసీపీ ఎమ్మెల్పీ అనంతబాబు. శాసనమండలి సమావేశాలకు వెళ్లేందుకు బెయిల్ కోరిన పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. దీనిపై గురువారం తన నిర్ణయం వెలువరించనుంది రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు. .