రాజ్యసభ ఎంపీగా తొలి జీతం ఆర్మీ కుటుంబాలకు విరాళమిచ్చిన చింతకాయల విజయ్ తన ప్రత్యేకతని చాటుకున్నారు. ఆర్మీ కుటుంబాలకు రూ.3 లక్షలు విరాళంగా ఇచ్చారు టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయంగా తన తొలి జీతం అందచేయడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈమేరకు పార్లమెంటులో రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ కు విరాళం చెక్కును అందజేశారు టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్. ఈ సందర్భంగా పలువురు ఎంపీ విజయ్ ని అభినందించారు. ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎన్నికయిన చింతకాయల విజయ్.. మొదటి రోజు నుంచి తన ప్రసంగాలతో విజయ్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.పార్లమెంటు చట్టం చేశాక ఏపీ రాజధాని అమరావతిని కదిలించే శక్తి ఎవరికీ లేదన్నారు. ఇటీవల మాజీ సీఎం జగన్ పై నమోదైన కేసుల్ని త్వరగా విచారించాలంటూ రాజ్యసభలో ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. చిన్నవయసులోనే రాజ్యసభలోకి ఎంట్రీ ఇచ్చి సందర్బోచితంగా ప్రసంగిస్తున్నారు.ఏపీ ప్రభుత్వం తరహాలోనే దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ఒక పథకం తేవాలని కేంద్రానికి సూచించారు.