మొబైల్ కనెక్టివిటీపై లోక్సభలో ఎంపీ ప్రశ్న
NEWS Aug 12,2026 10:30 pm
వరంగల్ జిల్లాలో గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు 4జీ, 5జీ మొబైల్ సేవల విస్తరణ, నెట్వర్క్ బ్లాక్స్పాట్ల తొలగింపు, కొత్త మొబైల్ టవర్ల ఏర్పాటుపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత మూడేళ్లలో జిల్లాలో మొబైల్ కనెక్టివిటీ విస్తరణ పరిస్థితి, కేంద్ర పథకాల కింద మంజూరై ఏర్పాటు చేసిన టవర్ల వివరాలను ఆమె కోరారు. నెట్వర్క్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు.