ఏపీ సీఎం చంద్రబాబుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసల జల్లుకురిపించారు. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్.. అభివృద్ధికి చిరునామా అన్నారు. ఏ పని చేసినా అద్భుతంగా చేయడం చంద్రబాబు ప్రత్యేకత అని పొగడ్తలతో ముంచెత్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నిరంతర శ్రమ, దార్శనికత కలిగిన చంద్రబాబు అభివృద్ధికి చిరునామాగా ఆమె అభివర్ణించారు. రాష్ట్రపతిని కలిశారు విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి రాష్ట్రపతికి వివరించారు. 'అమరావతి' కాఫీ టేబుల్ బుక్ అందజేశారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.