డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ₹5000 జరిమానా
NEWS Aug 11,2026 09:56 pm
మెట్పల్లిలో సోమవారం సాయంత్రం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన రంగు హరీష్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. అతనిపై కేసు నమోదు చేసి మెట్పల్లి కోర్టులో హాజరుపరచగా, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దయ్య రాజారాం రూ.5 వేల జరిమానా విధించినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై సూచించారు.