ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతు
NEWS Aug 11,2026 05:15 pm
నటుడు ప్రకాష్ రాజ్ కి ఈసీ అధికారులు షాకిచ్చారు. SIR ప్రక్రియలో నటుడు ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతైంది. ఇప్పటికే 4 ఓట్లు ఉన్నట్లు ప్రకాష్ రాజ్పై ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరులో ఓటును తొలగించింది ఈసీ . ఇక్కడే పుట్టిన నా ఓటు ఎలా పోయింది.గతంలో ఎంపీ అభ్యర్థిగా ఇక్కడే పోటీ చేశానని.. మళ్లీ ఓటు పొందడానికి ఏ డాక్యుమెంట్లు అడుగుతారోనని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. మరోవైపు ప్రకాశ్రాజ్కు పలుచోట్ల ఓటు హక్కు ఉందంటూ దిలీప్ కుమార్ అనే అడ్వకేట్ 2019లో బెంగళూరులోని హలసూరు గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బీబీఎంపీ అధికారులు, కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుతో పాటు ఏపీలోనూ ప్రకాశ్రాజ్కు ఓటు హక్కు ఉందన్నారు. ఈ కేసులో ప్రకాశ్రాజ్ విచారణకు వరుసగా హాజరుకాకపోవడంతో కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.