వైసీపీ నేతలు తాడేపల్లికి పాదయాత్ర చేస్తే బెటర్
NEWS Aug 11,2026 05:13 pm
ప్రభుత్వం పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహిస్తే.. వైసీపీ నేతలు ఉత్తుత్తి నిరసనలు, దీక్షలు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నేతలు.. యాత్రలు చేయాల్సింది సీమలో కాదు.. మీ అధినేత జగన్ ను ప్రశ్నించేందుకు తాడేపల్లికి పాదయాత్ర చేయండని చురకలు అంటించారు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి. కూటమి పాలనలో రాయలసీమ అభివృద్ది చెందడాన్ని వైసీపీ నాయకులు ఓర్వలేకున్నారన్నారు. వైసీపీ పాలనలో ఒక్క ఎకరాకు అయినా అదనంగా నీరిచ్చారా? రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడానికి జగనే కారణం అని ఆరోపించారు. జగన్ కు సీమ ప్రజల ఓట్లు కావాలి.. అభివృద్ధి మాత్రం పట్టదన్నారు. సీమ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. మరో మూడేళ్లలో సీమ రూపురేఖలు మారతాయన్నారు. ఎన్ని యాత్రలు చేసినా సీమ ప్రజలు జగన్ ను నమ్మరన్నారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి.