అమరావతిలో ఈనెల 13న మూడు ప్రారంభోత్సవాలు
NEWS Aug 11,2026 05:08 pm
ఏపీ రాజధాని అమరావతలో పండుగ వాతావరణం ఏర్పడింది. అమరావతి నిర్మాణంలో కొత్త అధ్యాయం ప్రారంభమయింది. ప్రజా రాజధానిలో ప్రారంభోత్సవాల సందడి ఏర్పడింది. ఈనెల 13న ఒకేరోజు మూడు కీలక ఘట్టాలు ఆవిష్కరణ కానున్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్ ప్రారంభానికి సిద్ధమైంది.అమరావతికి రాజమార్గంగా సీడ్ యాక్సిస్ రోడ్ నిలవనుంది. దీంతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు ఈనెల 13న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. అత్యాధునిక వసతులతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణం జరిగింది. 10.48 ఎకరాల విస్తీర్ణంలో క్వార్టర్స్ నిర్మాణం జరిగింది. 14.46 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 12 అపార్ట్మెంట్ టవర్లను నిర్మించింది ప్రభుత్వం. 288 మంది ప్రజాప్రతినిధులు నివసించేలా టవర్లు సిద్ధమయ్యాయి. 10.84 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా లో 6 ఎమ్మెల్యే క్వార్టర్స్, 3 ఎమ్మెల్సీ క్వార్టర్స్ సిద్ధం అయ్యాయి. అందుబాటులోకి 216 ఫ్లాట్లు వచ్చాయి. ఒక్కో ఫ్లాట్ 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఒక్కో అంతస్తులో ఇద్దరు ప్రజాప్రతినిధులు నివసించేలా డిజైన్ చేశారు. ఒక్కో టవర్ 49.80 మీటర్ల ఎత్తులో ఉంటుంది.