AP ఆక్వా రైతులకు మరో శుభవార్త
NEWS Aug 11,2026 05:02 pm
ఆక్వా రైతులకు ఖర్చు తగ్గనుంది. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుడు వేసింది.ఆక్వా సాగు రంగానికి విద్యుత్ రాయితీని మరింత విస్తరిస్తూ యూనిట్ విద్యుత్ను రూ.1.50కే అందించే రాయితీని విస్తరించింది. 6,500కు పైగా ఫారాలకు ప్రయోజనం కలగనుంది. ఈ మేరకు ఇంధన శాఖజీవో జారీచేసింది. కొత్తగా ప్రకటించిన ఆక్వా జోన్లలోని అర్హత కలిగిన అన్ని ఆక్వా ఫారాలు, అలాగే APSADA Act / CAA Act కింద నమోదైన అన్ని ఆక్వా ఫారాలు ఈ రాయితీకి అర్హత పొందనున్నాయి. భవిష్యత్తులో APSADA/CAA రిజిస్ట్రేషన్ పొందే అర్హత కలిగిన ఫారాలకు కూడా రిజిస్ట్రేషన్ తేదీ నుంచి ఈ రాయితీ వర్తిస్తుంది.ఈ రాయితీని 2026 జూన్ 1 నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే లబ్ధిదారులు 2027 మార్చిలోపు 0.9–0.95 పవర్ ఫ్యాక్టర్ సాధించాల్సి ఉంటుంది. లేకపోతే సబ్సిడీకి అర్హత ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆక్వా ఉత్పత్తి వ్యయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు అండగా నిలవనుంది. అంతర్జాతీయ మార్కెట్లో పోటీ ధరలు, నాణ్యమైన ఉత్పత్తితో నిలదొక్కుకునేలా చేయడం ప్రభుత్వ విద్యుత్ రాయితీ విధానానికి ప్రధాన ఉద్దేశమని ఉత్తర్వుల్లో పేర్కొంది.