రాష్ట్రపతి ముర్ముకు వైఎస్ సునీత లేఖ
NEWS Aug 10,2026 03:44 pm
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైఎస్ సునీత లేఖ రాశారు. తన తండ్రి వివేకా హత్య కేసు విచారణలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హత్య జరిగి ఏడేళ్లయినా పూర్తిస్థాయి దర్యాప్తు జరగడంలేదన్నారు. వివేకా హత్య వెనుక విస్తృత కుట్రకోణం వెలుగులోకి రాలేదని లేఖలో పేర్కొన్నారు. వివేకా హత్య గురించి ముందుగా తెలిసిన వ్యక్తులు, వారికి ఎలా తెలిసిందనే అంశాలపై విచారణ జరగలేదన్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని ఇప్పటికీ కనిపెట్టలేదన్నారు. నేను ఏ వ్యవస్థ, సంస్థలపైన ఆరోపణలు చేయట్లేదన్నారు సునీత. తన తండ్రి వివేకాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. నా తండ్రి హత్య వెనుక నిజాలు వెల్లడి కోసమే ప్రయత్నిస్తున్నానని .. సీబీఐ, న్యాయవ్యవస్థపై నాకు విశ్వాసం ఉందన్నారు వైఎస్ సునీత.