మాగనూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. నర్సింహారెడ్డి మృతిపట్ల మంత్రి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. పార్టీకి నర్సింహారెడ్డి చేసిన సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు.