మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు: కలెక్టర్
NEWS Aug 03,2026 07:54 pm
నిర్మల్ జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎస్పీ జానకి షర్మిలతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు, అక్రమ గుట్కా రవాణా, విక్రయాల నిర్మూలనపై చర్చించారు. ఆకస్మిక తనిఖీలు, కఠిన చర్యలు, యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించగా, మాదకద్రవ్యాల నియంత్రణకు పోలీసు శాఖ నిరంతర చర్యలు కొనసాగుతోన్నాయని ఎస్పీ తెలిపారు.