APలో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం
NEWS Aug 03,2026 12:47 pm
మార్కెట్లో బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో వినియోగదారులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కిలో నాణ్యమైన బీపీటీ స్టీమ్ బియ్యాన్ని రూ.52కే అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం విక్రయాలను విజయవాడ ఏపీఐఐసీ కాలనీ రైతుబజార్లో ప్రారంభించింది. నెల రోజులుగా బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు కిలోకు సుమారు రూ.10 వరకు పెరిగిన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రభుత్వం పరిశీలించింది.