సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా జరిగిన రంగం కార్యక్రమంలో అమ్మవారు ఆగ్రహం ప్రకటించారు. తనకు ఇచ్చిన మాట ప్రకారం విగ్రహ ప్రతిష్ఠ చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 6 నెలల్లోగా ప్రతిష్ఠ పూర్తి చేయకపోతే భారీ ప్రాణనష్టం తప్పదని హెచ్చరించారు. ఈ ఏడాది కుంభవృష్టి రూపంలో భారీ వర్షాలు, అగ్నిప్రమాదాలు సంభవిస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజల ప్రవర్తన తనను కంటతడి పెట్టిస్తోందని, వాటిని వదిలిపెట్టనని ఆవేదన వ్యక్తం చేశారు. లష్కర్ బోనాలు వైభవంగా ప్రారంభమైంది.