లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సతీసమేతంగా మహంకాలి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు.