అంగరంగ వైభవంగా బోనాల జాతర
NEWS Aug 02,2026 08:05 pm
నిర్మల్ పట్టణంలోని శివ మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలో ఆదివారం ఆషాడ మాస అమ్మవారి బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయాన్నే శివసత్తులు, పోతురాజుల వేషధారణతో, డప్పుల వాయిద్యాల సందడితో ఊరేగింపు ప్రారంభమైంది. సంఘ సభ్యులు, మహిళలు,అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కాలనీ నుండి మారమ్మ ఆలయం వరకు బోనాల నెత్తుకొని భక్తులు నృత్యాలు చేస్తూ ఆలయనికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు.