ఉపన్యాస పోటీల పోస్టర్ విడుదల
NEWS Aug 01,2026 10:09 pm
ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గ పరిధిలో పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీల ప్రచార పోస్టర్ను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణ, మాగనూరు, మక్తల్, ఊట్కూరు, నర్వ మండలాల విద్యార్థులు ఆగస్టు 30న జరిగే ఉపన్యాస పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాంక పద్మ, సంగోల అశోక్, కొత్తపల్లి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.