రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వాగ్దేవి స్కూల్ విద్యార్థిని ఎంపిక
NEWS Jul 31,2026 11:00 am
జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మెట్పల్లి ఆరపేటలోని వాగ్దేవి హైస్కూల్ 3వ తరగతి విద్యార్థిని కావ్యశ్రీ 200 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం సాధించింది. ఈ విజయంతో ఆగస్టు 7న హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఆమె ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్లు పుప్పాల నవీన్ కుమార్, నల్ల గోపిరెడ్డి, ముక్క నరేష్ విద్యార్థినిని అభినందించారు. అలాగే పీఈటీ ప్రవీణ్తో పాటు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.