మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పుప్పాల హనుమాన్ వీధిలో భారీ వర్షం కురిసింది. ఆకాశం నుంచి వర్షంతో పాటు చిన్న చేపలు కూడా పడ్డాయి. దీంతో చిన్నారులు, యువకులు పోటీపడుతూ చేపలు పట్టుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే, ఆ చేపలు ఎలా వచ్చాయి అనేది ఆసక్తికరంగా చర్చ నడుస్తోంది.