జగన్ పర్యటనలో రెచ్చిపోయిన వైసీపీ క్యాడర్
NEWS Jul 30,2026 01:04 pm
జగన్ పర్యటనలో విశాఖలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పార్టీ నేతల జనసమీకరణతో ఎయిర్పోర్టుకు భారీగా చేరుకున్న కార్యకర్తలు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ జగన్కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఒక దశలో ఎయిర్పోర్టు లోపలికి వెళ్లే మార్గంలో వాహనాలను అడ్డుకోవడంతో భారీగా ట్రాఫ్ జామ్ అయింది. విమాననగరం వైపు నుంచి షీలానగర్ మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో చెన్నై- కోల్కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది.