వరద నీటిలో మునిగిపోయిన పాఠశాల
NEWS Jul 29,2026 07:53 pm
మెట్పల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పట్టణంలో వరద నీరు పోటెత్తుతోంది. ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల చుట్టూ భారీగా నీరు చేరింది. పాఠశాల పక్కనే చెరువు కట్ట నిర్మాణం ఉండటంతో పై ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు చెరువులోకి వెళ్లలేక నిలిచిపోయింది. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది జేసీబీ సాయంతో వరద నీటిని మళ్లించే పనులు చేపట్టారు.