తల్లికి వందనం స్కీమ్లో మోసం
NEWS Jul 29,2026 02:49 pm
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన తల్లికి వందనం స్కీమ్లో సైబర్ మోసం బయటపడింది. కర్నూలు జిల్లాలో 28 మంది ఖాతాల్లో డబ్బులు మాయం చేశారు ఎయిర్టెల్ సిమ్ సేల్స్ పర్సన్స్. సిమ్లు అమ్మేటప్పుడు బాధితుల ఆధారాలు సేకరించిన కేటుగాళ్లు తమ పథకాన్ని అమలుచేశారు. బాధితుల వేలిముద్రలు, అకౌంట్ డీటెయిల్స్తో నగదు మాయం చేశారు.