‘తల్లికి వందనం’డబ్బులు పడలేదా?
NEWS Jul 29,2026 02:22 pm
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కింద 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జూలై 22 నుండి ఆర్థిక సాయం జమ చేసింది. .అర్హత ఉండి 'తల్లికి వందనం' పథకం డబ్బులు రూ.13వేలు అందనివారు ఆగస్టు 3 వరకు స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాలి. ఆగస్టు 4 నుంచి 10 వరకు అప్లికేషన్లను పరిశీలించి అదనపు అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తారు.