పొగాకు రైతులకు శుభవార్త
NEWS Jul 29,2026 02:20 pm
ఏపీలో ధరలు లేక నష్టపోతున్న పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ధర లోటు భర్తీ కింద కిలోకు అదనంగా ₹20 చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం ₹188 కోట్లను భరించనుంది. మార్కెట్లో బ్రైట్ రకం పొగాకు కిలో ₹240, మీడియం రకం ₹190, లోగ్రేడ్ ₹110కి తగ్గకుండా కొనుగోలు చేయాలని పొగాకు బోర్డును సీఎం ఆదేశించారు.