పార్లమెంట్ లో నడ్డా Vs ఖర్గే
NEWS Jul 29,2026 02:14 pm
పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ అంశం రాజ్యసభలో దుమారం రేపింది. దీనిపై ప్రతిపక్షాలు.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడగా, విపక్షాల ఆరోపణల్ని కేంద్ర మంత్రి జేపీ నడ్డా కొట్టిపారేశారు.రాజ్యసభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ.. ఇది కేవలం 'సాధారణ శాంతిభద్రతల సమస్య' మాత్రమేనని, పోలీసులు పరిస్థితిని అదుపు చేయడానికి చట్టబద్ధంగానే వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు దీనిని అనవసరంగా సంచలనం చేస్తున్నాయని ఆరోపించారు.