పీవీ ఆశయాలకు ప్రతీక విజ్ఞాన కేంద్రం
NEWS Jul 23,2026 09:35 pm
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆశయాలకు ప్రతీక వంగరలో విజ్ఞాన కేంద్రం నిర్మాణం అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మంగరలో నిర్మాణంలో ఉన్న పీవీ విజ్ఞాన కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేసి త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు,కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.