భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి రండి
NEWS Jul 22,2026 02:54 pm
ఏపీ సీఎం చంద్రబాబు డిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. పార్లమెంట్ హౌస్లో ప్రధానితో ఆయన సమావేశమయ్యారు. ఆగస్ట్ 1న జరిగే భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి మోదీని చంద్రబాబు ఆహ్వానించారు. ప్రారంభోత్సవానికి వస్తానని ప్రధాని తెలిపారు.