నకిలీ పత్రాలతో భూకబ్జా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ప్రస్తుతం అరెస్టు భయంతో పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ్మినేని సీతారాం హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని ఆయన హైకోర్టును కోరారు. అయితే హైకోర్టు ఇందుకు నిరాకరించింది.