పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
NEWS Jul 19,2026 10:05 pm
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు నిరంతరాయంగా కొనసాగుతాయి. ఈ విడత సెషన్స్లో పలు కీలకమైన బిల్లులను ఉభయ సభల ముందుకు తెచ్చి, వాటికి ఆమోదం ముద్ర వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు లోక్సభ సచివాలయం ఇప్పటికే సభా అజెండాను సిద్ధం చేసింది.