'ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలి'
NEWS Jul 18,2026 08:58 pm
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాల నేపథ్యంలో అధికారులు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్లకు పంట మార్పిడి, తాగునీటి నిర్వహణ, శాఖల వారీ ప్రణాళికలపై సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు అవసరమైన నివేదికలతో సమీక్షకు హాజరుకావాలని ఆదేశించారు.