చెక్ బౌన్స్ కేసుల్లో రాజీకి ప్రాధాన్యం ఇవ్వాలి
NEWS Jul 18,2026 06:44 pm
చెక్ బౌన్స్ కేసుల్లో కక్షిదారులు కోర్టులో పోరాడటం కంటే పరస్పరం రాజీ చేసుకోవడమే ఉత్తమమని మెట్పల్లి జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి అన్నారు. మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ప్రత్యేక లోక్ అదాలత్లో 15 పెండింగ్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు.