‘మిషన్ ఆగమన్’ప్రయోగం సక్సెస్
NEWS Jul 18,2026 01:09 pm
‘మిషన్ ఆగమన్’ ద్వారా భారత అంతరిక్ష రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేటు సంస్థ అయిన ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ను శనివారం ఉదయం 11.30 గం.లకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని ఒకటో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపారు.