పాకిస్తాన్ లోనూ జగన్నాథ రథయాత్ర
NEWS Jul 18,2026 12:00 pm
ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర లండన్ వరకు చాలా చోట్ల అప్రతిహతంగా కొనసాగుతోంది.విశేషం ఏమిటంటే.. మన పొరుగు దేశమైన పాకిస్థాన్లోనూ అదే ఉత్సాహం కనిపించడంతో హిందూ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరాచీ నగరంలోని చారిత్రక స్వామినారాయణ ఆలయం నుంచి జగన్నాథుడి రథయాత్రను ఘనంగా నిర్వహించారు. భక్తులు'జై జగన్నాథ్', 'హరే రామ', 'హరే కృష్ణ' నామస్మరణలతో రథాన్ని లాగుతూ భక్తిశ్రద్ధలు చాటారు.