అసైన్డ్ భూముల వ్యవహారంలో కీలక తీర్పు
NEWS Jul 17,2026 05:41 pm
అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ నేతలకు పెద్ద షాకిచ్చిందనే చెప్పాలి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, నారాయణపై పెట్టిన కేసులు రాజకీయ కక్ష సాధింపే అని హైకోర్ట్ స్పష్టం చేసింది. దీంతో వైసీపీ నేతలకు దిక్కుతోచడం లేదు. పరిపాలనాపరమైన నిర్ణయాలకు నేరపూరిత చర్యలను ఆపాదిస్తే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం అని కోర్ట్ వ్యాఖ్యానించింది. చట్టనిబంధన అనుసరించే జీఓ 141 తీసుకొచ్చారని.. జీఓ వల్ల నష్టపోయినట్లు రైతులెవరూ కోర్టును ఆశ్రయించలేదని హైకోర్ట్ పేర్కొంది.