మార్కెట్లోకి పాలిమర్ నోట్లు
NEWS Jul 17,2026 05:34 pm
మార్కెట్లోకి త్వరలో పాలిమర్ నోట్లు రానున్నాయి. 2027 నాటికి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలన్నది ఆర్బీఐ ఆలోచనగా ఉందని తెలుస్తోంది. నకిలీ నోట్లను అరికట్టడం, కరెన్సీ నోట్ల మన్నికను పెంచడం ముఖ్య ఉద్దేశం. ఇవి తడిని తట్టుకోగలవు. చిరిగి పోవడం, నల్లగా మారడం వంటి సమస్యలు ఉండవు. ఆస్ట్రేలియా, కెనడా, యూకే, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఇప్పటికే పాలిమర్ నోట్లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈపైలట్ ప్రాజెక్ట్లో భాగంగా తొలుత రూ.10, 20 విలువైన బ్యాంక్ నోట్లను ఆర్బీఐ వినియోగంలోకి తెస్తారు.