అమరావతి రెండో దశ మాస్టర్ ప్లాన్ 22వారాల్లో రెడీ
NEWS Jul 16,2026 03:06 pm
రాజధాని అమరావతి రెండో దశ మాస్టర్ ప్లాన్ను 22 వారాల్లో ఇస్తామని సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాజధాని విస్తరణ ప్రణాళికలో భాగంగా రెండో దశలో మొత్తం 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి ఈ సంస్థ సమీకృత మాస్టర్ప్లాన్ రూపొందిస్తోంది. రెండు రోజులుగా రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న సింగపూర్ ప్రతినిధుల బృందంతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి నివసించేలా, అత్యంత నివాసయోగ్యంగా అమరావతి ఉండాలని, రాష్ట్ర భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి కేంద్ర బిందువుగా ఉండాలన్నారు.