గ్యాస్ డెలివరీలో అదనపు వసూళ్లు చేస్తున్నారంటూ కలెక్టర్ కు ఫిర్యాదు
NEWS Jul 08,2026 12:59 am
మెట్ పల్లిలో గ్యాస్ ఏజెన్సీ డెలివరీ సిబ్బంది అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పట్టణానికి చెందిన సోమిడి జయరాం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,020 ఉండగా, డెలివరీ బాయ్లు రూ.1,060 చెల్లించాలని బలవంతం చేస్తున్నారని, ఒక్కో సిలిండర్పై రూ.40 అదనంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.