కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
NEWS Jul 07,2026 08:47 pm
తమ ప్రభుత్వంలో మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీదే నడుస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిరుపేదలకు ఇచ్చామని, సోలార్ విద్యుత్ కేంద్రాలు, శిల్పారామంలో నైట్ బజార్ను మహిళలకే ఇచ్చామని తెలిపారు. 2034లోగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు.