తెలంగాణలో పెన్షన్ అక్రమాలకు చెక్
NEWS Jul 05,2026 01:20 pm
తెలంగాణలో సామాజిక భద్రతా పెన్షన్లలో భారీ అక్రమాలు వెలుగుచూడడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక తనిఖీల్లో లక్ష మందికి పైగా అనర్హులు, మృతుల పేర్లపై పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించింది. 'లైఫ్ అథెంటికేషన్' ద్వారా అక్రమాలను వెలికితీసి, వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఇప్పటికే 2 లక్షల కొత్త పెన్షన్ల ప్రక్రియ కొనసాగుతుండగా, అనర్హుల స్థానంలో మరో లక్ష మందిని ఎంపిక చేయనుంది. దీంతో మొత్తం 3 లక్షల మంది అర్హులకు కొత్తగా ఆసరా పెన్షన్లు అందనున్నాయి.