ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
NEWS Jul 04,2026 03:31 pm
రాయికల్ మండలంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPTF) నాయకులు డిప్యూటీ తహశీల్దార్ అరుణ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. డీఏలు, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, సీపీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలన్నింటినీ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.