కేంద్ర మంత్రితో జగిత్యాల వాసి విమాన ప్రయాణం
NEWS Jul 02,2026 05:37 am
విమానంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రాచకొండ కుమారస్వామి (బాలాజీ MRF టైర్స్) యజమాని ప్రయాణించారు. అస్సాం గౌహతి నుంచి హైదరాబాద్ వరకు సాగిన ఈ ప్రయాణం ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రితో కలిసి ప్రయాణించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ గతంలో మధ్యప్రదేశ్ CMగా పనిచేసి, ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.