ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
NEWS Jul 01,2026 11:17 pm
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలిస్తూ, ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన తదితర అంశాలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు ఖచ్చితంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.