2k రన్ అవగాహన ర్యాలీ..
ర్యాలీని పాల్వంచ డిఎస్పీ
NEWS Jun 26,2026 10:09 am
పాల్వంచ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, పోలీసు సిబ్బంది, విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొన్నారు.