క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
NEWS Jun 25,2026 09:23 pm
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్సైట్ అడ్వాన్స్డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డా. స్రవంతి రెడ్డి తెలిపారు. శరీరంలో కదిలే క్యాన్సర్ కణాలను కూడా ఈ సాంకేతికత గుర్తించగలదని, చికిత్స సమయంలో కణితి పెరుగుదల లేదా తగ్గుదలను నిరంతరం పర్యవేక్షించే సామర్థ్యం దీనికి ఉందన్నారు. ఆరోగ్యకరమైన టిష్యూలకు హాని కలగకుండా, కేవలం క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుని చికిత్స అందించే అధునాతన సౌకర్యం ఈ హైపర్సైట్ వ్యవస్థలో అందుబాటులో ఉందని వివరించారు.