పెరిగిన పాస్పోర్ట్ ఫీజులు
NEWS Jun 25,2026 09:15 pm
పాస్పోర్ట్ ఫీజులను కేంద్ర ప్రభుత్వం పెంచింది. 36 పేజీలతో కూడిన పాస్పోర్ట్ రుసుమును ₹1500 నుంచి ₹2,500 పెంచింది. తత్కాల్ ఫీజును ₹3,500 నుంచి ₹5 వేలకు పెంచింది. 60 పేజీల పాస్పోర్ట్కు ప్రస్తుతం ₹2వేలు వసూలు చేస్తుండగా ఇక నుంచి ₹3500 వసూలు చేయనున్నారు. తత్కాల్ ఫీజును ₹6వేలుగా నిర్ణయించారు. 18ఏళ్లలోపు వయసున్న దరఖాస్తుదారులకు కొత్త పాస్పోర్ట్ రుసుము ₹1000 ఉండగా.. దీనిని ₹1750కి పెంచారు. కొత్త ఫీజులు జులై 1 నుంచి అమలులోకి వస్తాయి.