డ్రగ్స్, సైబర్ నేరాలపై ఎస్సై అవగాహన
NEWS Jun 24,2026 10:38 pm
కథలాపూర్లోని కలాదర హైస్కూల్లో స్థానిక ఎస్సై రవికిరణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల విద్యార్థులు తమ భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉందని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు అవగాహన పెంచుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. పాఠశాల చైర్మన్ గడ్డం భూమారెడ్డి, ప్రిన్సిపల్ కమలాకర్, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.