15 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ!
NEWS Jun 19,2026 11:22 pm
బిహార్ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీలో 15 ఏళ్ల అక్షర గుప్త అరుదైన ఘనత సాధించింది. కేవలం 126 బంతుల్లో 55 ఫోర్లు, 8 సిక్సర్లతో 306 పరుగులు చేసి ట్రిపుల్ సెంచరీ బాదింది. IPLలో సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ తరహాలో అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకుంది. 2024లో బిహార్ అండర్-19 జట్టుకు ఎంపికైన అక్షర, 14 ఏళ్లకే కెప్టెన్గా బాధ్యతలు చేపట్టింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో చిన్న వయసులోనే ట్రిపుల్ సెంచరీ సాధించి భవిష్యత్ స్టార్గా గుర్తింపు పొందుతోంది. ఆమె ఇన్నింగ్స్పై క్రికెట్ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.