అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించేందుకు హనుమకొండకు వెళ్లారు. నిరంజన్ చూపుతున్న ఆత్మవిశ్వాసం, పోరాటస్ఫూర్తి తనను కదిలించిందన్నారు. త్వరగా కోలుకోవాలని వెంకటేశ్వరస్వామి, భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. పర్యటనకు సహకరించిన సీఎం రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు థాంక్స్ తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరిచిపోలేనివని పవన్ అన్నారు.