రైతు వేదికలో ఆన్లైన్ ప్రక్రియ
NEWS Jun 14,2026 05:56 pm
బూర్గంపాడు (మం)లోని రైతులు జీలుగు విత్తనాల కొనుగోలు కోసం సోమవారం ఉ. 10:30 గంటలకు రైతు వేదికలో నిర్వహించే ఆన్లైన్ నమోదు కార్యక్రమానికి హాజరు కావాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలని తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) ద్వారా నమోదు ప్రక్రియ పూర్తిచేసుకుని కూపన్ పొందిన రైతులు అనంతరం పీఏసీఎస్ కేంద్రంలో జీలుగు విత్తనాలను కొనుగోలు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.