భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం
NEWS Jun 14,2026 12:38 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 2 గంటల సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు అనుభవించిన ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.